విద్యాసంస్థల్లో బోనాల పండుగ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామంలో శుభోదయం విద్యాసంస్థల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తంగళ్ళపల్లి మండల ఎంపీపీ మానస రాజు పాల్గొన్నారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించారు.

ప్రతి సంవత్సరము ఆషాడమాసంలో బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు.ఆషాడమాసంలో భాగంగా పోతరాజు,పోతరాజు విన్యాసాలు చేయడం జరిగింది.

దానిలో భాగంగా ఆడబిడ్డ అయినటువంటి తన చెల్లె గాని అక్క గాని తన పుట్టింటికి వెళ్లేటప్పుడు పోతరాజు భద్రతగా నిమ్మకాయలు పసుపు పూసుకొని వెళ్లడం జరుగుతుంది.

ఈ పండుగలో భాగంగా తంగళ్ళపల్లి మండల మైనార్టీ సెల్ నాయకులు హమీద్, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పడగల రాజు, శుభోదయం స్కూల్ చైర్మన్ మ్యదరబోయిన శ్రీనివాస్ యాదవ్, ప్రిన్సిపాల్ రాజశేఖర్ రావు, అనిల్ మాధవి, లావణ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: వామ్మో.. అంపైర్ అవుట్ ఇచ్చాడని కోపంతో ఏకంగా హెల్మెట్ తీసుకోని..