టాలీవుడ్ దెబ్బకు బెదిరిపోతున్న బాలీవుడ్!

కరోనా నేపథ్యంలో ఆగిపోయిన సినిమాలన్నీ ఈ ఏడాది వరుసగా విడుదల కావడంతో టాలీవుడ్ మొత్తం విడుదల పండుగను చేసుకుంటుంది.

స్టార్ హీరోల సినిమాలన్నీ ఈ ఏడాది నుండి విడుదల కాగా మంచి విజయాన్ని అందిస్తాయన్న వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి.

కొన్ని సినిమాలు చాలా సమయం పట్టడంతో ఓటీటీ లో విడుదలవ్వగా కొంతవరకు విజయాన్ని అందుకున్నాయి.

ఈ ఏడాది టాలీవుడ్ సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించుకుంటున్న నేపథ్యంలో.మంచి వసూళ్లను కూడా అందిస్తున్నాయి.

దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ కు టాలీవుడ్ దెబ్బ ఎదురవుతుందనే చెప్పవచ్చు.ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'.

ఈ సినిమాను దసరా సమయంలో మరో సినిమా పోటీకి రాకుండా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాజమౌళి తెలపగా అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సినిమా 'మైదాన్' కూడా అదే రోజున విడుదల కానున్న సందర్భంగా.

రాజమౌళిపై బోనీ కపూర్ విరుచుకు పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. """/"/ ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు కూడా బాలీవుడ్ ను మోత మోగిస్తోందని అర్థమవుతుంది.

ప్రభాస్ బాహుబలి తర్వాత ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే.ఆ సినిమా నుండే ప్రభాస్ కు బాలీవుడ్ లో కూడా ఫాలోయింగ్ పెరిగింది.

ఇక తమిళ్ హీరోలు రజినీకాంత్, విజయ్, సూర్య కూడా టాలీవుడ్ లో నటించగా ప్రస్తుతం ఈ హీరోల సినిమాలు కూడా బాగానే పోటీకి నిలుస్తున్నాయి.

ఇక కే జి ఎఫ్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించ గా.

ప్రస్తుతం కే జి ఎఫ్ 2 త్వరలో తెరకెక్కనుంది.ఈ సినిమా విడుదల సమయంలో కూడా హిందీ సినిమాలు కూడా వస్తున్నాయని వార్తలు వినిపించగా.

అందులో ఎక్కువ కే జి ఎఫ్ 2 కే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది.

అంతే కాకుండా అదే సమయంలో ప్రభాస్ సినిమా మా రాధేశ్యామ్ కూడా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కూడా త్వరలోనే విడుదల కానుండగా.

ఈ సినిమాకి కూడా గట్టి ప్రాధాన్యత కనిపిస్తుంది.ఇక తాజాగా విడుదలైన మెగా కొత్త హీరో వైష్ణవ్ తేజ సినిమా కూడ మంచి విజయాన్ని సాధించింది.

ఇక ఈ సినిమాలన్నీ పెద్ద స్థాయిలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉండగా.పెద్ద స్థాయిలోనే వసూళ్లను అందిస్తుందని అర్థమవుతుంది.

నిజంగానే బాలీవుడ్ టాలీవుడ్ దెబ్బకు బెదురుతుందని అర్థమవుతుంది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని…