నా సర్వస్వం ఆమే అంటూ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రణవీర్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు గా కొనసాగుతున్నటువంటి దీపికా పదుకొనే రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో విహరించిన ఈ జంట 4 సంవత్సరాల క్రితం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

వీరి వైవాహిక జీవితం ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ వీరి ప్రేమ కథకు మాత్రం పదేళ్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రణవీర్ సింగ్ తన ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా సినిమాలో జంటగా నటించిన వీరు ఈ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు.

ఈ సినిమా తర్వాత వీరిద్దరు జంటగా 'బాజీరావ్‌ మస్తానీ', 'పద్మావత్‌’, '83' వంటి చిత్రాల్లో సందడి చేశారు.

పెళ్లయిన తర్వాత కూడా దీపికా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రణవీర్ సింగ్ దీపికా గురించి పలు విషయాలను వెల్లడించారు.

"""/"/ గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా సినిమా సమయంలో తాను దీపికాను కౌగిలించుకోవడంతో ఆమె ఎంతో కోపడ్డారని, అలా ఆమె కోపం సంతోషం చూశానని, ఎప్పుడైనా తానే తన సర్వస్వం అని ఈ సందర్భంగా రణవీర్ తెలియజేశారు.

నా ఇష్టసఖి, మంచి స్నేహితురాలు కూడా తానేనని ఆయన తెలిపారు.ఇక పిల్లల గురించి ఈ సందర్భంగా రణవీర్ సింగ్ ను ప్రశ్నించగా ఆ విషయం దీపికాను అడగాలి అంటూ సమాధానం చెప్పారు.

ఇక దీపిక పదుకొనె ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!