జిగేలు రాణి పాటకు రెచ్చిపోయి మాస్ పెర్ఫార్మెన్స్ చేసిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!

ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ వేరు బాలీవుడ్ ఇండస్ట్రీ వేరు అనే వ్యత్యాసాలు ఉండేవి.

అయితే తెలుగులో బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన అనంతరం తెలుగు సినిమాఖ్యాతి ఎక్కడికో చేరిపోయింది.

దీంతో తెలుగు సినిమా సరిహద్దులను చెరుపుకుంటూ ఇతర భాషలలో కూడా సత్తా చాటుతుంది.

ఇలా తెలుగు సినిమాలపై మక్కువ పెంచుకునే వారి సంఖ్య అధికం అవ్వడంతో ఇతర భాష హీరోలు కూడా తెలుగులో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇక తెలుగు డైరెక్టర్లు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడి సినిమాలు చేస్తున్నారు. """/"/ ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతో ఫేమస్ అయినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా స్థిరపడ్డారు.

ఈ క్రమంలోనే ఈయన రణబీర్ కపూర్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లు యానిమల్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే చిత్ర బృందం అందరూ కలిసి సరదాగా పార్టీ జరుపుకున్నారు.

ఈ పార్టీలో భాగంగా రణబీర్ కపూర్ ఏకంగా తెలుగు పాటకు డాన్స్ వేయడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

"""/"/ ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలను రణబీర్ కపూర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం రంగస్థలం ఇందులో స్పెషల్ సాంగ్ జిల్ జిల్ జిగేల్ రాణి పాట ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే.

ఈ పాటలో పూజా హెగ్డే ఆడి పాడి సందడి చేశారు.ఇలా తెలుగులో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ పాటకు తాజాగా రణబీర్ కపూర్ మాస్ పర్ఫామెన్స్ చేస్తూ డాన్స్ చేశారు ఈ క్రమంలోని ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇప్పుడు రోజా, ధర్మాన వంతు ! రంగంలోకి సీఐడీ