నేను చనిపోతే నా ఆస్తి మొత్తం వాళ్లకే.. బిగ్ బీ అమితాబ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా ప్రేక్షకులకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి, ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించి కోట్లకు కోట్లు సంపాదించారు అమితాబ్ బచ్చన్.

కాగా అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ హీరో అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక ఆయన కోడలు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

"""/" / ఇది ఇలా ఉంటే ఇప్పటికీ ఆయన ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడపడంతో పాటుగా బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అమితాబ్ బచ్చన్ తన మరణం తర్వాత తన ఆస్తిని ఎవరికి రాసి ఇవ్వాలి అన్న అంశంపై స్పందించారు.

ఈ మేరకు ఆయన స్పందిస్తూ.నేను ఒక విషయంపై నిర్ణయం తీసుకున్నాను.

నేను వారి మధ్య భేదం చూపను.నేను చనిపోయినప్పుడు, నా వద్ద ఉన్న ఆస్తి అంతా నా కుమార్తె, నా కొడుక్కి సమానంగా పంచుతాను.

ఇద్ద‌రి విష‌యంలో ఎటువంటి భేదం లేదు.జయ( Jaya Bachchan) నేను చాలా కాలం క్రితం దీనిని నిర్ణయించుకున్నాము అని ఆయన తెలిపారు.

"""/" / అమ్మాయి పరాయా ధన్ అని అందరూ అంటుంటారు ఆమె తన భర్త ఇంటికి వెళ్తుంది.

కానీ నా దృష్టిలో ఆమె మా కుమార్తె అభిషేక్‌ కి ఉన్న హక్కులే ఆమెకు ఉన్నాయి అని తెలిపారు అమితాబ్ బచ్చన్.

ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ చాలా బాగా చెప్పారు కొడుకు కూతుర్ని ఇద్దరిని సమానంగా చూశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా అమితాబ్ బచ్చన్ ఇప్పటివరకు దాదాపుగా 1600 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారు.

ఆస్తులు విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

దేవర ట్రైలర్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇదే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ పక్కా!