చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన కొంతకాలం పాటు రాజకీయ పనులలో భాగంగా సినిమాలకు దూరమయ్యారు.కానీ తనకు రాజకీయాలు ఏమాత్రం సెట్ అవ్వని భావించి తిరిగి సినిమాలలోకి వచ్చారు.

ఇలా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి వరస సినిమాలలో నటిస్తున్న చిరంజీవి త్వరలోనే విశ్వంభర( Vishwambhara )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి.

"""/" / ఈయన సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మినహా మిగిలిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

కానీ విశ్వంభర సినిమా ద్వారా ఈయన సక్సెస్ అందుకోవడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

డైరెక్టర్ వశిష్ట( Vasista ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతోంది.

"""/" / ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష( Trisha ) నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్లో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా తర్వాత తిరిగి విశ్వంభర సినిమాలో వీరిద్దరి జోడిగా సందడి చేయనున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సరికొత్త అప్డేట్ విడుదల చేశారు.

ఈ సినిమాలో చిరంజీవితో పోటీ పడటం కోసం విలన్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.

విశ్వంభర సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్( Kunal Kapoor ) నటించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించి ఆయనకు విశ్వంభర సెట్ కి స్వాగతం పలికారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

జూలైలో పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్స్.. ఎన్ని మిలియన్ డాలర్లంటే!!