కాకినాడ జిల్లా గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోకులంకలో విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

నిన్న గోదావరిలో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి.తణుకుకు చెందిన నలుగురు యువకులు గోదావరిలో దిగి గల్లంతైన సంగతి తెలిసిందే.

మృతులు ఫణీంద్ర, బాలాజీగా పోలీసులు గుర్తించారు.మరో ఇద్దరి కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

తణుకుకు చెందిన ఎనిమిది మంది విహారయాత్ర నిమిత్తం యానం వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.