ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌కు న‌ల్ల మిరియాల‌తో చెక్ పెట్టండిలా!

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో జీవం పోసుకున్న అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను చుట్టు ముట్టేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌తి రోజు ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు.

ఇక ఓవైపు క‌రోనా.మ‌రోవైపు వ‌ర్షాకాలం కావ‌డంతో.

జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు చాలా మందిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి.

అయితే న‌ల్ల మిరియాలు ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అదెలానొ ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌గ్గు, గొంతు నొప్పితో బాధ‌ప‌డేవారు న‌ల్ల మిరియాల‌ను పొడి చేసి.గోరు వెచ్చ‌ని నీటిలో క‌లుపి తీసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా ద‌గ్గు, గొంతు నొప్పి త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే ఒక గ్లాసు గోరు వ‌చ్చిని పాల‌లో న‌ల్ల మిరియాల పొడి, తేనె క‌లిపి.

ప్ర‌తి రోజు తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు స‌మ‌స్య దూరం అవుతుంది.

జ్వ‌రంతో బాధ‌ప‌డేవారు న‌ల్ల మిరియాల‌తో త‌యారు చేసిన సూప్‌ను తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జ్వ‌రం క్ర‌మంగా త‌గ్గుతుంది.

ఇక న‌ల్ల మిరియాల‌ను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా న‌ల్ల మిరియాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.న‌ల్ల మిరియాల‌ను రోజు ఏదో ఒక విధంగా తీసుకుంటే.

శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న అద‌న‌పు కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గేలా చేస్తుంది.అలాగే ఉద‌యాన్ని మిరియాల టీ తాగితే.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని న‌ల్ల మిరియాల‌ను ఎక్కువ‌గా మాత్రం తీసుకోకూడ‌దు.

న‌ల్ల మిరియాల‌ను అతిగా తీసుకుంటే అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

ఆ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిగ్ బాస్ శివాజీ… సరైన నిర్ణయం తీసుకోడంటూ?