మునుగోడుపై బీజేపీ స్పెషల్ ఫోకస్

మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో అభ్యర్థి కోసం వేట కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత చెలమల కృష్ణారెడ్డితో కమలం నేతలు మంతనాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా మునుగోడు అభ్యర్థిగా ఓబీసీ మోర్చా కార్యదర్శి వీరమల్ల అనిల్ కుమార్ గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం.

కాగా బీసీల ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో తెరపైకి అనిల్ కుమార్ పేరు వచ్చిందని ప్రచారం జోరుగా సాగుతోంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్