ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తొలి విజయాన్ని అందుకుంది.ఈ మేరకు అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(Nallamilli Ramakrishna Reddy) విజయం సాధించారు.

అనపర్తిలో వైసీపీ (YCP)అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డిపై(Suryanarayana Reddy) సుమారు 20,567 ఓట్ల మెజార్టీతో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి గెలుపొందారు.

కాగా ఇప్పటికే మూడు ప్రాంతాల్లో టీడీపీ(TDP) జయకేతనం ఎగురవేసింది.రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ(Rajahmundry Rural, Rajahmundry City,) మరియు పాలకొల్లులో(Palakollu) టీడీపీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అయితే పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి గూడాల గోపాలరావుపై టీడీపీ అభ్యర్థి నిమ్మల సుమారు 63,463 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.

కల్కి సినిమా సక్సెస్ అవ్వడం మారుతి కి వరమా.? శాపమా.?