జూన్ ఏడో తారీకు రాజమండ్రి లో బీజేపీ భారీ బహిరంగ సభ..!!

జూన్ 7వ తారీకు "గోదావరి గర్జన" పేరుతో రాజమండ్రిలో ఏపీ బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉంది.

ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి ఏపీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమమే చాలా ఎక్కువ అని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి 20 లక్షల ఇళ్లను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 వేల ఇళ్లను మాత్రమే నిర్మించడం జరిగిందని ధ్వజమెత్తారు.

పొలిటికల్ మైలేజ్ కోసం కోనసీమ ప్రాంతంలో అల్లర్లు సృష్టించినట్లు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు.

కాగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీకి దిగుతున్నారు.

ఈ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ నన్ను బ్యాడ్ చేశాడు.. వైరల్ అవుతున్న సోనియా షాకింగ్ కామెంట్స్!