తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి

వర్షాలు( Rains ) ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.

కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు.రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.

రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.

నష్టపోయిన ప్రతి రైతు( Formers )కి ఎకరానికి 50వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.

తడిచిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలి.రైతులకు గోనె సంచులు సైతం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించని పరిస్థితి.రైతు భరోసా కేంద్రాలు( Raitu Bharosa Kendram ) నామ మాత్రంగా ఉన్నాయి.

ఇన్సూరెన్స్ ప్రీమియం( Insurance Premium ) కట్టని నేపథ్యంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.