ప్రజలు ఎలా పోయినా ఈ సిఎంకు పరవా లేదా – భాజపా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి
TeluguStop.com
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం: భాజపా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.
నిన్న రాజ శ్యామల యాగం ఎవరి కోసం చేశారు.ఎవరి తృప్తి, ఎవరి మెప్పు కోసం చేశారు.
సిఎం కుటుంబం బాగుండాలని దేవాదాయ శాఖ డబ్బుతో చేస్తారా.ప్రజలు ఎలా పోయినా ఈ సిఎం కు పరవా లేదా.
నిన్న సిఎం తీసుకున్న సంకల్పం కూడా వింత గా ఉంది.ఇలాంటి విధానం మేమెప్పుడూ చూడలేదు, వినలేదు.
వీటికి దేవదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి.వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తారా.
ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత నిధులు తెచ్చారో వివరాలు వెల్లడించాలి.