అధికారంలోకి రాగానే 10 వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తాం.. సోము వీర్రాజు

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట: సోము వీర్రాజు  కామెంట్స్.రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది.

ప్రస్తుత ప్రభుత్వం దిశ దశ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతోంది.రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం లో రాజధాని నిర్మాణం చేపడితే, ప్రస్తుత ప్రభుత్వంలో దాని నిర్మాణం ఆపేసి విశాఖపట్నం రాజధాని అంటున్నారు.

2024 లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.అధికారం చేపట్టగానే అమరావతిలో అద్భుతమైన రాజధాని నిర్మాణం చేపడతాం.

10 వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తాం.గతంలో రాజధాని కోసం ఖర్చు చేసిన 7200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు.

కృష్ణా నదిపై ప్రత్యేకమైన వంతెనలు, విజయవాడ నగరం చుట్టూ నాలుగు వరసల రహదారి నిర్మాణం చేపడతాం.

కొడుకును పట్టించుకోని పూరి జగన్నాధ్…కారణం ఏంటంటే..?