ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు హాజరైయ్యారు.

పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు అదానీ వ్యవహారంతో పార్లమెంట్ గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

అదానీ వ్యవహారంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

హరిహర వీరమల్లు తో విసిగిపోయిన క్రిష్ ఏం చేస్తున్నాడో తెలుసా..?