వైసీపీ పాలనపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్
TeluguStop.com
ఏపీలోని వైసీపీ పాలనపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీబీఐపైనే కేసులు పెట్టడం వైసీపీ పాలనకు నిదర్శనమని విమర్శించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని సత్యకుమార్ చెప్పారు.
జగన్ ను కాపాడాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.కర్ణాటక ఎన్నికల్లో ఓడినా బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు.
వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రం సర్వనాశనమైందని ఆరోపించారు.