BJP : ఢిల్లీలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఢిల్లీలో రెండో రోజు బీజేపీ( BJP ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

భారత్ మండపం వేదికగా జరిగే ఈ సమావేశాల్లో విపక్ష కూటమి టార్గెట్ గా నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) ప్రసంగించనున్నారు.

పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మాట్లాడనున్నారు. """/" / అలాగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ లో ఇవాళ మరో తీర్మానం చేయనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ ఇండియా కూటమి( Congress INDIA Alliance ) నిరాశ రాజకీయాలు అనే పేరుతో చేస్తున్న ఈ తీర్మానాన్ని అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు.

ఇందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi ) ప్రసంగం ఉండనుంది.

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా మోదీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మధుమేహులకు వరం ఆవాలు.. ఇలా తీసుకుంటే అదిరిపోయే లాభాలు..!