సీఎం జగన్ తో భేటీ అయిన బీజేపీ ఎంపీ..!!

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలియని వారు ఉండరు.ఇటువంటి విషయాన్నైనా అలవోకగా ముక్కుసూటిగా ప్రశ్నించే సుబ్రహ్మణ్య స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఈ విషయంలో గతంలో ప్రశంసించడం జరిగింది.

ఇటువంటి తరుణంలో తాజాగా ఈ రోజు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ కి వచ్చి.

మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు.ఈ క్రమంలో టీటీడీ పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన నేడు మధ్యాహ్నం సీఎం జగన్ తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే టీటీడీ పై జరుగుతున్న అసత్య ప్రచారాలు పై.గతంలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

ఏది ఏమైనా బిజెపి పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ విజేతలుగా శ్రీసత్య-సంకేత్​!