ఏపీ గవర్నర్ తో బీజేపీ ఎంపీ జీవీఎల్ భేటీ..!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కలిశారు.

కేంద్రం పథకాలను రాష్ట్రం తమ ప్రభుత్వ పథకాలుగా అమలు చేస్తోందని ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా విశాఖ భూ స్కాంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు జీవీఎల్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జీవీఎల్ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు ఏపీలో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని గవర్నర్ కు వివరించినట్లు వెల్లడించారు.

ఏపీలో సమస్యత్మక నియోజకవర్గాలు ఇవేనా ? ఎన్నికల కమిషన్ ఏం చేయబోతోంది ?