బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు.. కేసు మరో మలుపు !

ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ కేసు మరో మలుపు తిరిగింది.

ఆరోపణలు చేసిన బాధితురాలికి హైకోర్టు స్టే విధించింది.గతంలో ఓ మహిళ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగితో తనకు రెండేళ్లుగా శారీరక సంబంధం ఉందని ఓ వీడియోను విడుదల చేసింది.

దీంతో పాటు బాధితురాలు పోలీసులు కూడా ఫిర్యాదు కూడా చేసింది.ఈ మేరకు పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

ఈ విషయంపై విచారణ జరిపిన డెహ్రాడూన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ నిర్వహించారు.

వేధింపుల విషయంలో బాధితురాలికి ఎమ్మెల్యే నేగీ, అతడి భార్య డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని బాధితురాలి తరఫున న్యాయవాది ఆరోపించారు.

ఈ మేరకు పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది.

ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి, అతని భార్యపై లైగింక వేధింపుల కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు.

దీంతో పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.లైగింక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు గతంలో పేర్కొంది.

తన భర్త డీఎన్ఏ తన కుమార్తెకు పరీక్ష చేయగా సరిపోలడం లేదని, ఎమ్మెల్యే డీఎన్ఏను ఓ సారి పరీక్షించాలని, అది మ్యాచ్ అవుతుందని మహిళ గతంలో ఆరోపించింది.

దీనిపై ఎమ్మెల్యే, అతని భార్య డబ్బు ఇవ్వాలని ప్రయత్నించారు.దీంతో న్యాయస్థానం వీరిపై కేసు ఫైల్ చేసింది.

గన్స్ తో రఫ్ఫాడిస్తున్న టాలీవుడ్ సూపర్ హీరోయిన్స్..!