బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ద‌మ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు.

బై ఎలక్ష‌న్ రావాలంటే ద‌మ్ముండాల‌న్న ఆయ‌న‌.రాజ‌గోపాల్ రెడ్డికి ఆ ద‌మ్ము ఉంద‌ని వ్యాఖ్య‌నించారు.

మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ శ‌రవేగంగా దూసుకుపోతుంద‌న్నారు.కావాలంటే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తెలుసుకోవాల‌ని సూచించారు.

అదేవిధంగా ప్ర‌స్తుతం రాజీనామాలు చేస్తున్న అంద‌రి చూపు బీజేపీ వైపే ఉంద‌ని తెలిపారు.

ఏదేమైనా అల్లు వారి తెలివి ముందు అందరూ దిగదుడుపే!