టెన్త్ ప్రశ్నాపత్రాల వ్యవహారంలో విచారణకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల
TeluguStop.com
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారణకు హాజరుకానున్నారు.
ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు వెళ్లనున్నారు.విచారణ నేపథ్యంలో శామీర్ పేట నివాసం నుంచి ఈటల రాజేందర్ హన్మకొండకు బయలు దేరారు.
అయితే పరీక్షా కేంద్రం నుంచి పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంపై ఈటల రాజేందర్ విచారణకు హాజరు కావాలంటూ వరంగల్ పోలీసులు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.