తెలంగాణలో బిజెపి మార్క్ దాడులు మొదలు ?

బారత దేశం లో ఏ ఎన్నికలలోనైనా బిజెపి( BJP ) వచ్చే ముందు ఈడి, ఐటి వంటి విచారణ సంస్థ లను ముందు పంపుతుందన్న ప్రతిపక్ష నాయకుల ఆరోపణలే నిజమైనట్లుగా తెలంగాణలో వరుస పరిణామాలు జరుగుతున్నాయి.

తన పై ఈడి దాడులు జరుగుతాయన్న సమాచారం ఉందని , బీ ఆర్ ఎస్ మరియు బిజేపి కుమ్మక్కై తనపై దాడులు చేయిస్తారని ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాఖ్యానించి 24 గంటలు గడవక ముందే ఐ టి అధికారులు ఆయన తలుపు తట్టారు .

హైదరాబాదులోనూ ,ఖమ్మంలోనూ ఆయన నివాసాలు మరియు కార్యాలయాలపై ఏక దాటిన దాడులు చేశారు.

గురువారం ఆయన నామినేషన్ కి ముహూర్తం ఉన్నందున ఆయనను మానసికం గా ఇబ్బందులు పెట్టేందుకే ఈ దాడులు జరిగాయని ఆయన అనుచరులు చెప్తున్నారు.

కాంగ్రెస్లో జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగల కీలక నేతల ను టార్గెట్ గా చేసుకొని అధికార బారస దాడులు చేయాలని చూస్తుందని, దానికి కేంద్ర భాజపా వంత పాడుతుందని ఈ రెండు పార్టీ లు లోపాయికారి ఒప్పందంలో ఉన్నాయన్న కాంగ్రెస్ విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నట్లుగా ఈ దాడులు జరిగాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

"""/" / ముఖ్యంగా ఖమ్మం జిల్లా ( Khammam )గెలుపు బాధ్యతలను తన మీద వేసుకున్న పొంగులేటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ తరహా దాడులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి .

అయితే ఇవి సాధారణ విధులలో భాగంగా జరిగిన దాడులే అని అధికార పక్షం ఎంత సమర్ధించుకున్నా కేవలం ఎన్నికల సమయంలో , అది కూడా ప్రతిపక్ష నాయకులను మాత్రమే టార్గెట్ చేసుకొని జరుగుతున్న దాడులు కావడం తో ఇవి పూర్తిగా రాజకీయప్రేరేపిత దాడులే అని రాజకీయ నాయకులతో పాటు సాధారణ వోటర్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది .

అయితే ఎవరెన్ని దాడులు చేసినా తాను భయపడనని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది అంటూ పొంగులేటి ( Ponguleti Srinivasa Reddy )స్పష్టం చేస్తున్నారు .

బజపా లో చేరమని తనపై బారీ ఎత్తున ఒత్తిడి వచ్చిందని అయినా కూడా తాను కాంగ్రెస్లో చేరినందుకే తనపై కక్ష పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వంత బజాపా మద్దత్తు ఇస్తుందని సుధాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

"""/" / రానున్న రోజుల్లో మరింత మంది కీలక నేతలను కేంద్రంగా చేసుకొని మరిన్ని దాడులకు కేంద్ర ,రాష్ట్ర విచారణ సంస్థలు పాల్పడవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

తాము ఓడిపోతామని బారాసాకు తెలిసిపోయిందని కాబట్టే ఈ తరహా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు