ఈనెల 30 నుంచి బీజేపీ మహా జన్ సంపర్క్ అభియాన్

తెలంగాణలో ఈనెల 30 నుంచి బీజేపీ మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం ప్రారంభంకానుంది.

జూన్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతుండటంతో పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో సుమారు 30 రోజుల పాటు జిల్లా, మండల శక్తి కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలుస్తోంది.

అదేవిధంగా లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.ఈ నేపథ్యంలో కార్యక్రమాల నిర్వహణ కోసం బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రత్యేక కమిటీని నియమించారు.

వీడియో: ఎలిగేటర్‌తో జాగ్వార్ భీకర పోరాటం.. చివరికి ఏమైందో చూడండి..