అక్రమ అరెస్ట్ లను ఖండించిన బిజెపి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం రోజున జరిగినటువంటి బిజెపి,ఏబీవీపీ నాయకుల అక్రమ అరెస్ట్ లను, రిమాండ్ ను భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పక్షాన తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో నియంత్రత్వ, నిరంకుశ రాచరిక పాలనా సాగుతుందన్నారు .

దేశంలో అన్ని రాష్ట్రాలలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై పరిపాలన సాగుతుంటే రాష్ట్రంలో మాత్రం కల్వకుంట్ల రాజ్యాగం నడుస్తుందని ఆరోపించారు .

ఈ పాలనా చూస్తుంటే నిజాం నిరంకుశత్వ రజాకార్ల వ్యవస్థ గుర్తుకు వస్తుందని, ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాల్సిన పోలీస్లే అధికార పార్టీకి కొమ్ము కాస్తు అక్రమ కేసులు పెడుతాన్నారని అన్నారు .

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చిత్ర పటాన్ని నిషేధిత గుట్కా ప్యాకెట్స్ తో అభిషేకించినప్పుడు బి ఆర్ ఎస్ నాయకులపై ఎందుకు కేసులు పెట్టలేదు అని ప్రశ్నించారు .

కావాలనే బిజెపి నాయకులను ఇబ్బంది పెట్టాలనే ప్రశ్నించే గొంతుకను అణిచివేయడానికే ఈ అక్రమ అరెస్ట్లు లు అని అన్నారు .

జరిగిన సంఘటనతో సంబంధం లేకుండా అణిచి వేయాలనే దొరిణితో పోలీస్లు ఇష్టం వచ్చిన సెక్షన్స్ పెట్టారని ఈ అరెస్ట్ లకు పూర్తి బాధ్యత కేటీర్ దేనని .

వచ్చే ఎలక్షన్లో మీ బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మీరు చేసే చర్యలకు కచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్,ధార తిరుపతి, శ్రీశైలం , మహేందర్ పటేల్, పర్శరాములు,మహేష్, లింగం, తిరుపతి బీజేవైఎం నాయకులు మహేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

జుట్టు బలోపేతం కోసం ఈ కాఫీ హెయిర్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!