భద్రత తొలగింపుపై బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆగ్రహం

భద్రత తొలగింపుపై బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భధ్రత తొలగింపునకు ఎమ్మెల్యే నన్నపనేని నరేందరే కారణమని ప్రదీప్ రావు ఆరోపించారు.ఈ నేపథ్యంలో తనకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యే నరేందర్, ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది.

ముందుగా ప్రదీప్ రావుకు 2+2 భద్రత కల్పించిన సర్కార్.ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో గన్ మెన్లను తొలగించింది.

ఈ క్రమంలోనే ఏడేళ్లుగా నలుగురు గన్ మెన్లు ప్రదీప్ రావుకు సెక్యూరిటీ కల్పిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆ నలుగురు గన్ మెన్లను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

సీడెడ్ లో సంచలనాలు సృష్టించిన దేవర.. ఎన్టీఆర్ మాత్రమే ఏకైక హీరో అంటూ?