ఇవాళ సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ సూర్యాపేట జిల్లాకు వెళ్లనున్నారు.

అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన జనగర్జన సభకు హాజరుకానున్నారు.నేషనల్ పోలీస్ అకాడమీలో కార్యక్రమాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షా సూర్యాపేటకు బయలుదేరనున్నారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం 3.45 గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు.

సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు.

తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్న అమిత్ షా తరువాత ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

కాగా ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది.అదేవిధంగా జనగర్జన సభకు పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

దేవర 2 పై క్లారిటీ ఇచ్చిన కొరటాల.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?