బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదు..: కిషన్ రెడ్డి
TeluguStop.com

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన నేత ఈటల రాజేందర్( Etala Rajender ) అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఈటల రాజేందర్ ను గెలిపించుకుందామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణలో 12 కు పైగా స్థానాలను గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ కు బీజేపీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదని చెప్పారు.బీఆర్ఎస్ నేతలు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని తెలిపారు.
5-స్టార్ హోటల్లో ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ చేసి తప్పించుకోవాలనుకున్న యువతి.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే షాక్!