నేడు పొంగులేటిని కలవనున్న బీజేపీ చేరికల కమిటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని బీజేపీ చేరికల కమిటీ ఇవాళ కలవనుంది.

ఈ క్రమంలో చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలో పొంగులేటిని కమలం పార్టీలోకి నేతలు ఆహ్వానించనున్నారు.అయితే ఇప్పటికే పొంగులేటిని బీజేపీ చేరికల కమిటీ అనేక సార్లు కలిసింది.

దీంతో పొంగులేటి పార్టీ మార్పుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వీడియో: పేరెంట్స్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్‌ చూసి కొడుకు అదిరిపోయే రియాక్షన్..