తెలంగాణలో ప్రచారంపై దూకుడు పెంచిన బీజేపీ..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ( Bjp ) ప్రచారంలో దూకుడు పెంచింది.

ఈ మేరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ స్థాయి బూత్ అధ్యక్షుల సమ్మేళనాలను కమలనాథులు నిర్వహించనున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతల ఆధ్వర్యంలోనే సమ్మేళనాలు జరగనుండగా ఈ నెల 11, 12 మరియు 13వ తేదీల్లో మండల స్థాయి సమావేశాలు జరగనున్నాయి.

అదేవిధంగా ఈ నెల 15, 16 మరియు 17 వ తేదీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

వెంకటేష్ 20 స్టోరీలను రిజెక్ట్ చేశాడా..? కారణం ఏంటి..?