Bandi Sanjay : సీబీఐ, ఈడీతో బీజేపీకి సంబంధం లేదు..: బండి సంజయ్
TeluguStop.com
కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) ప్రజాహిత యాత్ర నిర్వహించారు.
ఈ మేరకు కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వరకు యాత్రను నిర్వహించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే యాత్ర చేస్తున్నామన్నారు.
సీబీఐ, ఈడీతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. """/" / ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )ను అరెస్ట్ చేస్తామని ఎప్పుడూ అనలేదని తెలిపారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress ) చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎక్కడుందని తాము పొత్తు పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు.
ఇంతకముందు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )లోనే కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యారని గుర్తు చేశారు.
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఈసారి మూడో స్థానమేనన్న బండి సంజయ్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలోనే బ్లాక్బస్టర్ హిట్స్తో కంబ్యాక్ ఇచ్చారు.. ఎవరంటే..??