రోటరీ లింబ్ సెంటర్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు .

రోటరీ లింబ్ సెంటర్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు వారి జన్మదినం సందర్భంగా ఉచితంగా 84మందికి కృత్రిమ పాదాలు పంపిణీ పువ్వాడ ఫౌండేషన్ ద్వారా విరాళం ఖమ్మం : ఎన్.

ఎస్.పి రోటరీ లిమ్ సెంటర్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు గారి 84వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు .

ఈ సందర్బంగా 84మందికి దివ్యాంగులకు జేపూర్ పరిజ్ఞానంతో చేయించిన కృత్రిమ పాదాలను మరియు చిన్నారులకు సైకిల్ లను , మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు .

అలాగే 3,36,000 రూపాయల చెక్కు ను వారు విరాళంగా పువ్వాడ ఫౌండేషన్ ద్వారా అందజేశారు .

అనంతరం రోటరీ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ మానవ జాతి పరిణామ క్రమంలో 'మనిషిని మనిషిగా' తీర్చిదిద్దిన జీవన వేదమే సహానుభూతి అని ఈ సహానుభూతి ఆధారంగానే ఎదుటి మనిషియొక్క శారీరక , మానసిక , ఆర్ధిక , సామాజిక బాధలను అర్ధం చేసుకుంటుందని , బాధాసర్పద్రష్టులైన దివ్యాంగులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చినందుకు పువ్వాడ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు రోటరీ లింబ్ సెంటర్ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

దశాబ్దాలుగా , అంచెలంచెలుగా , రాజకీయ భావజాలలకు అతీతంగా లక్షలాది మందికి చేరువ కావటానికి మీ విధి విధానాల రూపకల్పనే సమ సమాజం కోసం అన్ని వర్గాలతో సాన్నిహిత్యంగా మెలిగి , ప్రతివారికి 'పువ్వాడ నా మనిషి' అన్నంతగా చేరువైనారు అని అన్నారు .

విద్య , ఆరోగ్య సామాజిక అవసరాలను సహానుభూతితో తీర్చి ప్రజలకు ఆసరాగా నిలిచారని కొనియాడారు .

ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ ట్రస్ట్ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్కు వెన్నుదన్నుగా ఉంటు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా సహాయసహకారాలు అందజేస్తారని పేర్కొన్నారు .

అనంతరం కేక్ కట్ చేసి నిర్వాహకులు పువ్వాడ నాగేశ్వరరావు దంపతులను ఘనంగా శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందించారు .

ఈ కార్యక్రమంలో క్లబ్ చైర్మన్ పి.డి.

జి.మల్లాది వాసుదేవ్ , అధ్యక్షులు వల్లభనేని రామారావు , కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు , పసుమర్తి రంగారావు , Sk.

అక్బర్ పాషా , కాళ్ళ పాపారావు , మేకల భిక్షమయ్య , తవిడిశెట్టి హన్మంతరావు , 53వ డివిజన్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య - పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు .