బిగ్ బాస్ 5 : మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామ్ చంద్ర..!

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం చంద్ర నిలిచాడు.

నాలుగు రౌండ్లలో టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టగా మొదటి రౌండ్ లోనే కాజల్, ప్రియాంకా, షణ్ముఖ్ డిస్ క్వాలిఫై అయ్యారు.

ఇక రెండు, మూడు రౌండ్లలో ఆట ఆడగా అప్పుడు సిరి, సన్నీ కూడా టికెట్ టు ఫినాలే రేసు నుండి బయటకు వచ్చారు.

ఇక ఫైనల్ రౌండ్ లో మానస్, శ్రీరాం చంద్ర ఆడగా ఆ రౌండ్ లో శ్రీరాం చంద్ర గెలిచాడు.

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం చంద్ర నిలిచాడు.

మొదటి నుండి తనదైన ఆట ప్రదర్శిస్తూ ఆడియెన్స్ ను మెప్పిస్తున్న శ్రీరాం చంద్ర ఇండియన్ ఐడల్ ఇమేజ్ కూడా యాడ్ అవడంతో టైటిల్ రేసులో ఉన్నాడు.

ఇక మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం చంద్ర అర్హుడనే చెప్పొచ్చు.ఇక మిగిలిన ఆరుగురిలో ఎవరు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.

ఎవరు టాప్ 5లో ఉంటారు అన్నది చూడాలి.బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం రావడం అతని ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.

శ్రీరాం చంద్రతో పాటుగా సన్నీ, షణ్ముఖ్ టైటిల్ రేసులో ఉన్నారు.వీరి ముగ్గురిలోనే టైటిల్ విన్నర్ ఉంటాడని తెలుస్తుంది.

అనుష్క శర్మ , విరాట్ బాడీగార్డ్ శాలరీ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవాల్సిందే!