బిగ్ బాస్ హౌస్ లో జై బాలయ్య అంటూ నినాదాలు.. సోషల్ మీడియాలో వైరల్!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో చూస్తూండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.

ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీలు జరుగుతున్నాయి.

అలాగే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్ లు ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తూ హౌస్ లో వారితో సందడి సందడి గా గడుపుతూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జై బాలయ్య అన్న నినాదాలు ఆకాశాన్ని అంటాయి.

తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి గత సీజన్ విన్నర్ సన్నీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఎడిషన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడుతున్న భాస్కర్, అఖిల్, అనిల్, అరియానా, బిందుమాధవి ల మధ్య పోటీని పెట్టాడు.

ఇక ఆ పోటీల్లో భాగంగా బాబా భాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను గెలుచుకున్నాడు.

టాస్క్ ముగిసిన తర్వాత సన్నీ హౌస్ లో కంటెస్టెంట్ లతో కలిసి సరదా సరదాగా గడిపాడు.

అనంతరం బిగ్ బాస్ హౌస్ లో బాలయ్య సాంగ్ ఒకటి ప్లే చేయగా సన్నీ తో పాటు అందరూ స్విమ్మింగ్ పూల్ లోకి దిగి జై బాలయ్య జై జై బాలయ్య అంటూ గట్టిగా అరిచారు.

ఇక ఆ తరువాత అందరూ ఫ్రెష్ అయ్యాక సన్నీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతూ హౌస్ లో ఉన్న ఏ ఒక్కరూ తక్కువ కాదని అందరూ టఫ్ ఫైట్ ను ఇస్తున్నారని ఒక్కొక్కరి గురించి వివరిస్తూ ఆ తరువాత చివర్లో బాలయ్య బాబు డైలాగ్ చెప్పాడు.

"""/"/ ఇక అప్పుడు కూడా హౌస్ లో కంటెస్టెంట్ లు జై బాలయ్య అన్న నినాదాలతో టాప్ లేపేశారు.

ఇది ఇలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఎలిమినేషన్స్ విషయంలో అషు రెడ్డి, అరియానాలు చివరి స్థానంలో డేంజర్ జోన్ లో ఉన్నారు.

అరియానా కి ఎవిక్షన్ పాస్ వాడతార, లేదంటే అషు కి అది కూడా కాదంటే మీరు నెక్స్ట్ వీక్ కూడా ఆ ఎవిక్షన్ ను వాడుకోవచ్చు అని బాబా భాస్కర్ కి బంపర్ ఆఫర్ చేశాడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.

ఇది ఇలా ఉంటే ఈవారం అషు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సలార్ సెంటిమెంట్ రిపీట్ కానుందా.. ఆ తేదీకి మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కానుందా?