మోనాల్ తో బ్రేకప్.. సోషల్ మీడియాకు బిగ్ బాస్ అఖిల్ దూరం?

బిగ్ బాస్ సీజన్ 4 తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న అఖిల్ ప్రస్తుతం ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

బిగ్ బాస్ ముందు అంత పరిచయం లేని వ్యక్తిగా ఉన్న అఖిల్ బిగ్ బాస్ లో పాల్గొన్నాక మరో కంటెస్టెంట్ మోనాల్ తో ప్రేమాయణం చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు.

అంతేకాకుండా ఈ జంట హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మరింత సన్నిహితంగా మారి ఒకరినొకరు వదులుకోలేనంత దగ్గరగా అయ్యారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను, వ్యక్తిగత విషయాలనే కాకుండా మోనాల్ తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటాడు అఖిల్.

నిత్యం ఏదో ఒక పోస్టు తో బిజీగా ఉండే అఖిల్ గత వారం నుండి సోషల్ మీడియాకు దూరమయ్యాడు.

ఎటువంటి పోస్టులను కూడా చేయకుండా సైలెంట్ గా ఉండిపోయాడు.దీంతో ఆయన ఫాలోవర్స్ తెగ ఎదురుచూడగా.

తాజాగా మళ్లీ ముందుకు వచ్చాడు.ఇన్ని రోజులు తాను దూరంగా ఉండటానికి కారణం చెప్పాడు.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

కొన్నిసార్లు మనం మరింత బలంగా తయారవ్వాలంటే కాస్త దూరంగా ఉండాల్సిందే అని అన్నాడు.

ఇక ఆ సమయంలో తనకు ఎన్నో జరిగాయంటూ, వాటి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు.

ప్రతి రోజు ఒక గుణపాఠమే.అందులో నుంచి మనం నేర్చుకున్నది, మర్చిపోయామన్నది ముఖ్యమని తెలిపాడు.

"""/"/ గత వారం నుండి యాక్టివ్ గా లేనందుకు క్షమించండి అంటూ.మళ్లీ ఫుల్ ఎనర్జీతో ముందుకు వచ్చానని తెలిపాడు.

తాను కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని దానివల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపాడు.

ఆ సమయంలో తనకు ఎన్నో మెసేజ్ లు, కాల్స్ వచ్చాయని.అందుకే మళ్లీ ముందుకు వచ్చానని అభిమానులతో పంచుకున్నాడు.

అందరితో ఇలా టచ్ లో లేకపోవడంతో అందరికీ బాధ కలిగించిందని.అంతే బాధ కూడా తనకు కలిగిందని తెలిపాడు.

అందరిని ఎంతో మిస్సయ్యాను అంటూ.ఒకవేళ మీరు లేకపోతే ఇంకొన్ని రోజులు ఇలాగే ఉండి పోయేవాడిని అని తెలిపాడు.

ఇక అందరికీ హాయ్ అంటూ అందరు బాగున్నారా అని ఆశిస్తున్నానని, తాను కూడా మస్త్ ఉన్నానని చెప్పాడు.

ఇక తనకు ఎదురైన గడ్డు పరిస్థితి గురించి చెప్పకపోవడంతో మోనాల్ తో బ్రేకప్ జరిగిందా అని అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిగ్ బాస్ శివాజీ… సరైన నిర్ణయం తీసుకోడంటూ?