భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ చోరీ.. !

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ చోరీ జరిగింది.జిల్లాలోని నర్సాపురంలో ఓ వ్యాపారి నివాసంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

వ్యాపారి చెరుకుమల్ల రుక్కయ్య ఇంటికి వచ్చిన దుండగులు మరణాయుధాలతో బెదిరించి బంగారం, నగదును దోచుకెళ్లారని తెలుస్తోంది.

పోలీసులమని చెప్పి ఇంటిలోకి వచ్చిన దొంగలు రుక్కయ్య కుటుంబ సభ్యులను బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరి జరిగిన ఇంటిని పరిశీలించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

అయితే గతంలోనూ మావోయిస్టులమని చెప్పి కొందరు వ్యక్తులు తుపాకీలతో బెదిరించి దోపిడీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆ వెలితి ఎప్పటికీ అలాగే ఉంటుంది…తారక్ కామెంట్స్ వైరల్!