పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీకి అమెరికా భారీ జరిమానా.

రెండ్మెండ్ కేంద్రంగా పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ ఐటీ కార్యకలాపాలు చేస్తోంది ఈ కంపెనీకి వివిధ దేశాలలో ఆఫీసులు కూడా ఉన్నాయి.

దాదాపు మూడు దేశాల్లో కలిపి 10 ఆఫీసులు వరకూ ఈ సంస్థకి ఉన్నాయి.

ఇండియాలో హైదరాబాద్ ,అధోని ,బెంగుళూరు లలో కూడా ఆఫీసులు కలవు అయితే ఈ కంపెనీ లో పని చేస్తున్న ఉద్యోగులకి సరైన జీతాలు ఇవ్వని కారణంగా ఈ సంస్థకి అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రెండ్మెండ్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలోని తన ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ జీతం ఇస్తున్నారని లేబర్ వేజ్ అండ్ హవర్ డివిజన్ విభాగం గుర్తించడంతో 12 మంది హెచ్‌ 1 బీ ఉద్యోగులకు మూడు లక్షల డాలర్లను ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించింది.

అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు 45 వేల డాలర్ల ఫైన్‌ విధించింది.అయితే హెచ్ 1బి వీసాలను ఐటీ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ఈ కంపెనీ హెచ్ 1 బి కంప్యూటర్ అనలిస్టులు, కంప్యూటర్ ప్రొగ్రామర్స్ గా పనిచేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎంట్రీ లెవల్ జీతాలు ఇస్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు.

ఎంతో అనుభవం ఉన్న ఈ ఉద్యోగులుకు భారీ జీతాలు ఇవ్వాల్సి ఉండగా కంపెనీ తక్కువ జీతంతో పనిచేయిస్తున్నారని అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలిన కంపెనీలు అలెర్ట్ అవుతాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !