పూజా, రష్మిక మధ్య రసవత్తరమైన పోటీ..!

ప్రస్తుతం టాలీవుడ్ ని ఊపేస్తున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య రసవత్తరమైన పోటీ ఏర్పడింది.

తెలుగులో వరుస స్టార్ అవకాశాలు అందుకుంటున్నారు పూజా హెగ్దే, రష్మిక మందన్న.అయితే పూజా హెగ్దే లేదంటే రష్మిక మందన్న అంటున్నారు దర్శక నిర్మాతలు.

తెలుగులో స్టార్ సినిమా అంటే వీరిద్దరు కాదన్న తర్వాతే మరో హీరోయిన్ దగ్గరకు వెళ్తున్నారు.

ఇదిలాఉంటే తెలుగు, తమిళంలో సత్తా చాటుతున్న వీరు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పోటీ పడుతున్నారు.

ఇప్పటికే రష్మిక చేతిలో 3 హిందీ సినిమాలు ఉన్నాయి.పూజా హెగ్దే కూడ్డా అక్కడ సినిమాలు చేస్తుంది.

తెలుగులో పోటీ పడుతున్న పూజా హెగ్దే, రష్మికలు బాలీవుడ్ ఆఫర్ల కోసం కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది.

ఇక టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కోసం కూడా ఈ ఇద్దరి భామల మధ్య ఫైట్ జరుగుతుంది.

తన గ్లామర్ తో పూజా హెగ్దే, అందం అభినయం రెండిటితో రష్మిక ఇద్దరు ఇలా తన పోటీని కొనసాగిస్తున్నారు.

చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ ఇద్దరి భామలని కొట్టే హీరోయిన్ మరెవరు లేరని చెప్పాలి.

 వీరికి డేట్స్ కుదరకనో.లేక కాదంటేనో మిగతా హీరోయిన్స్ కు ఛాన్సులు వస్తున్నాయి.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!!