జనాలను పిచ్చోళ్లను చేయొద్దు.. అలియా భట్ పై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌( Alia Bhatt ) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా.

వేదాంగ్‌ రైనా మరో లీడ్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా అక్టోబర్‌ 11న విడుదలైంది.

తాజాగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సిద్ధం చేసుకుంది.కానీ ఈ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

అయితే మూవీ విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా కష్టపడిన విషయం తెలిసిందే.

అయితే ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తిల సినిమా విక్కీ విద్య కా వో వాలా వీడియో రిలీజైంది.

"""/" / దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.అయితే ఈ పోటీని తట్టుకుని జిగ్రా అదరగొడుతోందంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి.

సినిమా అద్భుతంగా ఆడుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.దీంతో చాలామంది ఇది నిజం అని నమ్ముతున్నారు.

అయితే తాజాగా ఈ పోస్టులపై.ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్‌( Divya Khosla Kumar ) స్పందించింది.

జిగ్రా చూద్దామని పీవీఆర్‌ మాల్‌ కు వెళ్లాను.థియేటర్‌ అంతా ఖాళీగా ఉంది.

ప్రతి ఒక్క చోట కూడా ఇదే పరిస్థితి.అయినా ఆలియా భట్‌ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/10/ya-khosla-kumar-alia-bhatt-bollywood-Jigra-Box-Office-soacial-media!--jpg" /అన్ని టికెట్లు తనే కొనేసినందుకు లేదా ఫేక్‌ కలెక్షన్స్‌ ప్రకటించినందుకు! పెయిడ్‌ మీడియా ఎందుకు సైలెంట్‌ గా ఉందో అర్థమవట్లేదు అని తెలిపారు.

ఏదేమైనా మనం ఆడియన్స్‌ ను ఫూల్‌ చేయవద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది.

ఈ పోస్టుకు తను థియేటర్‌లో జిగ్రా సినిమా ( Jigra )చూస్తున్న ఫోటోను జత చేసింది.

అందులో థియేటర్‌ హాల్‌ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.మరి ఈ పోస్ట్ పై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

సంక్రాంతి బరిలో రామ్ చరణ్, వెంకటేష్, బాలయ్య సినిమాలకు పోటీ గా వస్తున్న ‘మహేంద్ర గిరి వారాహి’…