'ఎసెన్స్ ఆఫ్ భీమ్లా నాయక్'.. నాలుగవ పాటపై అఫిషియల్ అప్డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముందు నుండే అంచనాలు ఉన్నా కూడా ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ ల కారణంగా మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇక మాటల మాంత్రికుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తుండడంతో ఈ సినిమా మరొక రేంజ్ కు వెళ్ళిపోయింది.

ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుని మరి ఈ సినిమాను సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుండే స్టార్ట్ చేసి వరుస అప్డేట్ లు ఇస్తున్నారు.

"""/"/ ఇక తాజాగా ఈ సినిమా నుండి నాలుగవ సింగిల్ ను విడుదల చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన మూడు పాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.

ఇక ఇప్పుడు నాలగవ పాట రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు.

"""/"/ తాజాగా ఈ రోజు ఉదయం మేకర్స్ ఈ సినిమా నుండి వచ్చే నాలుగవ పాట గురించి ఒక అప్డేట్ ఇచ్చారు.

''ఎసెన్స్ ఆఫ్ భీమ్లా నాయక్'' అడవి తల్లి మాట అంటూ ఈ నాలుగవ పాట రేపు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

రేపు ఉదయం 10 గంటల 8 నిముషాలకు ఈ పాట రాబోతున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

ఇప్పటికే థమన్ అందించిన మూడు పాటలు రికార్డులు క్రియేట్ చేయగా ఇక ఈ పాట కూడా మరొక రికార్డ్ క్రియేట్ చేస్తుందని అభిమానులు అంత ఎదురు చూస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లాకు బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీలు చేసింది శూన్యం : ధర్మపురి సంజయ్