భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో రాజన్నపేట, అల్మాస్ పురం గ్రామాలలో కార్యకర్తలు బండి సంజయ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత గ్యారెంటీ ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.

బిఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన బిఆర్ఎస్ పార్టీని ఎన్నిక లలో ప్రజలు బుద్ధి చెబుతారని, గ్రామాలలో ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వైపు ఉన్నారు ప్రజల నుండి అద్భుతంగా స్పందన వస్తుంది.

మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నారు.కావున బండి సంజయ్ కుమార్ కి మీ మద్దతు తెలిపి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రాజి రెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, ఉడుగుల యాదగిరి, ప్రశాంత్, కమ్మరి ఆంజనేయులు,బాల గౌడ్, కిరణ్ నాయక్, చందుపట్ల లక్ష్మారెడ్డి, గణేష్,శ్రీశైలం, బంధారపు లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి,కృష్ణ హరి, బొమ్మడి స్వామి, వంగల రాజు, నంది నరేష్, సత్యం రెడ్డి,బలగం శ్రీను, మంత్రి శ్రీను, బోడావత్ రవి, ధరావత్ రవి,సాగర్, శ్రీకాంత్,ప్రకాష్,వేణు,దయాకర్, హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై24, బుధవారం 2024