ఫోర్బ్స్ స్వయం సంపన్న జాబితాలో ప్రవాస భారతీయ మహిళలు
TeluguStop.com
ఎంతో అత్యత్తమ ప్రతిభ కలిగిన లేక ఎంతో మందిని ప్రభావితం చేసిన అదికాక ఆర్ధికంగా స్థిరపడి ప్రపంచంలో అత్యధికంగా సంపన్న జాబితాలో ఉన్నవారిని ఫోర్బ్స్ తన మ్యాగజైన్ లో ప్రచురిస్తుంది.
ఈ పత్రికలో ఎవరి కోసం ప్రచురించినా సరే వారికి ఎన్నో ప్రతిభా ఫాటవాలు ఉన్నట్టు లెక్క అయితే ఈ ఫోర్బ్స్ పత్రికలో ఇద్దరు భారత సంతతి మహిళలకి కూడా చోటు కల్పించింది.
ఇంతకీ వారు సాధించిన ఘటన ఏమిటంటే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
భారత సంతతికి చెందిన ఇద్దరు టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్లకు స్వశక్తితో ఎదిగిన ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో స్థానంలో చోటు కల్పించింది.
వారు జయశ్రీ ఉల్లాల్ , నీరజ శేఠి లు.ఫోర్బ్స్ జాబితాలో వీరిలో జయశ్రీ 18 స్థానంలో నిలవగా , నీరజ 21వ స్థానంలో నిలిచారు.
జయశ్రీ ఉల్లాల్ లండన్లో జన్మించి భారత్లో పెరిగారు.జయశ్రీ ఉల్లాల్ ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సిఇఒగా పని చేస్తున్నారు.
అయితే స్టాక్మార్కెట్లో లిస్టింగ్ అయిన ఈ కంపెనీ 2017 సంవత్సరంలో 160 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది.
ఈ కంపెనీలో జయశ్రీకి 5 శాతం వాటాలున్నాయి.ఆ వాటాల్లో కొన్నింటిని ఆమె తన ఇద్దరు పిల్లలు, మేనల్లుడు, మేనకోడలికి కూడా కేటాయించారు.
ఇక నీరజ శేఠి విషయానికి వస్తే ఐటి కన్సల్టింగ్ , ఔట్సోర్సింగ్ కంపెనీ సింటెల్ వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నారు.
ఆమె భర్త భరత్ దేశాయ్ ఈ కంపెనీ వ్యవస్థాపకుడు.1980లో రెండు వేల కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ కంపెనీ 2017 నాటికి 92.
4 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది.23 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.
వారిలో 80 శాతం మంది ఇండియాలోనే పని చేస్తున్నారు.
కోడి ధర కొండెక్కడంతో చికెన్ కిలో రూ.400…!