భగవంత్ కేసరి సినిమాకు పోటీగా ఎన్టీఆర్ అదుర్స్ మూవీ రీ రిలీజ్.. అసలు నిజమేంటంటే?

ఈ నెల 19వ తేదీన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.

దసరా పండుగ కానుకగా ఇతర సినిమాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి.అయితే భగవంత్ కేసరి సినిమాకు పోటీగా అదుర్స్ మూవీ( Adhurs Movie ) రీ రిలీజ్ కానుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నాయి.

బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే వైరల్ అవుతున్న వార్తల్లో అసలు నిజమేంటనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు.ఎవరో కావాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

అదుర్స్ మూవీ నిర్మాతలు వైసీపీ నేతలు కావడంతో ఈ తరహా ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.

అదుర్స్ మూవీ రీ రిలీజ్ కావడం నిజమే అయినా నవంబర్ నెల 18వ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

"""/" / బాలయ్య,( Balakrishna ) ఎన్టీఆర్( Jr NTR ) మధ్య గ్యాప్ ను మరింత పెంచడానికి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాలయ్య, ఎన్టీఆర్ మధ్య ప్రస్తుతం చిన్నచిన్న విభేదాలు ఉన్నా రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ తగ్గుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వేర్వేరు ప్రాజెక్ట్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.

"""/" / బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నందమూరి ఫ్యాన్స్( Nandamuri Fans ) ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?