మొటిమలు మచ్చలుగా మారుతున్నాయా? ఈ ఒక్క చిట్కాను పాటిస్తే వారంలో అవి మాయం!
TeluguStop.com
సాధారణంగా కొందరికి మొటిమలు వచ్చి అవి చివరకు నల్లటి మచ్చలుగా మారుతుంటాయి.వీటినే పింపుల్ మార్క్స్ అంటారు.
మొటిమల వల్ల ఏర్పడే ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే వీటిని వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.రక రకాల క్రీములు, సీరమ్లు వాడుతుంటారు.
అయినప్పటికీ తగ్గకుంటే ఏం చేయాలో తెలీక స్కిన్ కేర్ హాస్పటల్స్ చుట్టూ తిరుగుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాను పాటిస్తే గనుక కేవలం వారం రోజుల్లోనే ఆ మచ్చలను తగ్గించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటి చిట్కా ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.
? మరియు ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలను తెలుసుకుందాం పదండీ.
ముందుగా రెండు కర్పూరం బిళ్ళలను తీసుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు గుప్పెడు తులసి ఆకులను నీటిలో వేసి శుభ్రంగా కడిగి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తులసి ఆకుల పేస్ట్, ముందుగా పొడి చేసి పెట్టుకున్న కర్పూరం, అర టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, పావు స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" / ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట అప్లై చేసి పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే గనుక మచ్చలు క్రమంగా మటు మాయం అవ్వడాన్ని మీరే గమనిస్తారు.
మొటిమలు వల్ల ఏర్పడిన మచ్చలే కాదు.ముఖంపై ఏ మచ్చలు ఉన్నా ఈ చిట్కాను ప్రయత్నించి తగ్గించుకోవచ్చు.
కూటమికి చిరు మద్దతు తెలపడానికి అదే కారణం.. పిఠాపురంలో పవన్ గెలుపు కష్టం: చిట్టిబాబు