ఇవి తీసుకుంటే..వేస‌విలో మీ ఆరోగ్యం ప‌దిలంగా ఉన్న‌ట్టే!

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.రోజులు గ‌డుస్తున్న కొద్ది భానుడు ప్ర‌తాపం పెరిగిపోతోంది.

ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఏసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.ఈ వేస‌విలో ఆరోగ్యంపై త‌గిన శ్ర‌ద్ధ వ‌హించ‌క పోతే ప్రాణాలే ప్ర‌మాదంలో ప‌డ‌తాయి.

అందుకే ఈ వేస‌విలో ఎండల‌ నుంచి తప్పించుకునేందుకు, ఒంటికి చల్లదనాన్ని మ‌రియు శక్తిని అందించేందుకు త‌గిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తాటి బెల్లం వేసివి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

తాటి బెల్లం క‌లిపిన నీటిని ప్ర‌తి రోజు ఒక గ్లాస్ చ‌ప్పున తీసుకుంటే.

శ‌రీర వేడి దూరం అవుతుంది.మ‌రియు నీర‌సం, అల‌స‌ట‌, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అలాగే వేస‌విలో త‌ర‌చూ కొబ్బ‌రి నీరు తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే కొబ్బ‌రి నీరులో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి తీసుకుంటే.

త‌క్ష‌ణ శ‌క్తి ల‌భించ‌డంతో పాటు వేస‌విలో ఇబ్బంది పెట్టే అధిక దాహం స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ధనియాలు మ‌రియు పావు స్పూన్ సోంపు వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.

ఈ వాట‌ర్‌ను ఉద‌యానే తీసుకోవాలి.దీని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌టంతో పాటు డీహైడ్రేష‌న్ స‌మ‌స్య బారిన కూడా ప‌డ‌కుండా ఉంటారు.

పల్చ‌ని మజ్జిగలో కొద్దిగా నిమ్మ ర‌సం మ‌రియు చిటికెడు ఉప్పు వేసి క‌లిపాలి.

ఈ డ్రింక్‌ను ఒక గ్లాస్ చ‌ప్పున ఉద‌యం, మ‌ధ్యాహ్నం తీసుకుంటే.వేస‌విలో వేధించే నీరంస‌, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొవ‌చ్చు.

మ‌రియు వేస‌వి తాపం నుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొందుతారు.ఇక వీటితో పాటు దానిమ్మ పండు, క‌ర్బూజా పండు, పుచ్చ కాయ వంటివి త‌ర‌చూ తీసుకోవాలి.