అతడితో లవ్ ఎఫైర్ వల్లే ఈ నటి తన భర్తతో విడిపోయిందా...?

2011వ సంవత్సరంలో బెంగాలీ భాషలో ప్రముఖ దర్శకుడు రాజ్ చక్రబర్తి దర్శకత్వం వహించిన "శత్రు" అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమై బాగానే అలరించిన బెంగాలి నటి "నుస్రత్ జహాన్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే ఆ మధ్య ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి మమతా బెనర్జీ స్థాపించిన ఆల్ ఇండియా "త్రుణుమల్ కాంగ్రెస్ పార్టీ"లో చేరింది.

అంతేకాకుండా 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఎంపీగా గెలుపొందింది.ఆ తర్వాత "నిఖిల్ జైన్" అనే ప్రముఖ వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాల కారణంగా విడిపోయారు.ఇటీవలే నుస్రత్ జహన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ తన భర్త నిఖిల్ జైన్ తో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది.

దీంతో నుస్రత్ జహన్ తల్లి కాబోతుందని కానీ ఆమె తల్లి కావడానికి కారణం బెంగాల్ రాష్ట్రంలోని ఓ ప్రముఖ పొలిటీషియన్ అని అంతేకాకుండా గత కొద్ది కాలంగా నుస్రత్ జహాన్ ఓ ప్రముఖ పొలిటీషియన్ తో ప్రేమలో పడిందని ఈ కారణం వల్లే నిఖిల్ జైన్ నుస్రత్ జహన్ విడిపోయారని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో నుస్రత్ జహన్ అభిమానులు ఆమె ప్రియుడు ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

కానీ ఇప్పటి వరకు నుస్రత్ జహాన్ మాత్రం తన లవ్ ఎఫైర్ పై వినిపిస్తున్న వార్తల గురించి స్పందించడం లేదు.

దీంతో అసలు నిజం ఏంటనేది నుస్రత్ జహన్ నోరు విప్పే వరకు క్లారిటీ రావడం లేదు.

"""/"/ ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో నిఖిల్ జైన్ ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలు అంటూ బిజీ బిజీగా గడుపుతోంది కాగా ఇటీవలే బెంగాలీ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించిన "స్వస్తిక్ సంకేత్" అనే  థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఆ వ్యాక్సిన్ వల్లే పునీత్ రాజ్ కుమార్ మరణించారంటూ ప్రచారం.. నిజమేంటంటే?