బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో గంజాయి కలకలం..!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో గంజాయి కలకలం సృష్టించింది.కళాశాలలో దాదాపు 20 మంది విద్యార్థులు నిషేధిత గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా గుట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ప్రాథమికంగా ఆరుగురు విద్యార్థులను గుర్తించి హాస్టల్ నుంచి పంపించివేసినట్లు సమాచారం.

అదేవిధంగా గంజాయికి బానిసైన విద్యార్థులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.కాగా మంచిర్యాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.

గంజాయి సరఫరాపై విచారణ రహాస్యంగా కొనసాగుతుందని తెలుస్తోంది.ఇంత జరుగుతున్న పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.

Pougues Les Eaux : Bonus Et Promotions Expliqués Pour Les Joueurs Avertis