రాగట్లపల్లి నుంచి నారాయణ పూర్ కు వెళ్ళేదారిలో ఎలుగుబంటి సంచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి నుంచి నారాయణపురం వెళ్లే దారిలో ఎలుగుబంటి( Bear ) సంచరించినట్లు గురువారం చూసిన ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు( Forest Officials ) రాగట్లపల్లి నారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గురువారం రాత్రి వరకు గాలించారు.

అయినప్పటికీ దాని ఆచూకీ లభించలేదు.నారాయణపురం , రాగట్లపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంత ప్రజలను కోరారు.

దేవర మూవీ గురించి ఇండస్ట్రీ టాక్ ఇదే.. ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ?