మ‌ధుమేహం ఉన్న‌వారు చిక్కుడు తింటే ఏం అవుతుందో తెలుసా?

మ‌ధుమేహం లేదా డ‌యాబెటిస్‌.అర‌వై ఏళ్ల‌కు వ‌చ్చే ఈ స‌మ‌స్య నేటి కాలంలో ముప్పై ఏళ్ల‌కే వ‌స్తోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.మ‌ధుమేహం ఒక సారి వ‌చ్చిందంటే జీవిత కాలం మ‌న‌తోనే ఉంటుంది.

జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది.మ‌రియు స్వీట్స్‌కు దూరంగా ఉండ‌డంతో పాటు ఎన్నో జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.

అయితే ఇలాంటి వారికి చిక్కుడు కాయ‌లు ఒక ఔష‌ధంలా ప‌ని చేస్తాయి.అవును, వారానికి రెండు సార్లు చిక్కుడు కాయ‌ల‌తో త‌యారు చేసిన‌ వంట‌లు తీసుకోవ‌డం వ‌ల్ల.

అందులో ఉండే సోలుబుల్ ఫైబర్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో అదుపులో ఉండేలా చేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాబ‌ట్టి, మ‌ధుమేహం రోగులు చిక్కుడు కాయ‌ల‌తో త‌యారు చేసిన వంట‌ల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం మంచిదంటున్నారు.

ఇక చిక్కుడు కాయ‌ల‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగుతున్నాయి.ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తోంది.

ఈ స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకునేందుకు ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌య‌త్నిస్తున్నారు. """/" / అయితే యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్క‌లంగా ఉండే చిక్కుడును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌చ్చు.

అలాగే చిక్కుడు తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న వారు చిక్కుడు తీసుకుంటే చాలా మేలు చేస్తుంది.

ఎందుకంటే.చిక్కుడులో ఉండే మాంగనీస్.

నిద్రలేమి స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది.ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉండే చిక్కుడు త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలె‌స్ట్రాల్ క‌రిగించి.

మంచి కొలెసస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.త‌ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు అధిక బ‌రుకు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.

అలాగే చిక్కుడును డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌త‌మ‌రుపు త‌గ్గి.మెద‌డు చురుగ్గా పని చేసేలా చేస్తుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.