ఆ బామ్మ చనిపోయింది

కొన్ని రోజుల క్రితం లండన్‌లో టీం ఇండియా క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఒక ఎన్నారై మహిళ స్టేడియంకు రావడం జరిగింది.

ఆమెకు కోహ్లీ అంటే వీరాభిమానం.ఆ అభిమానంతోనే ఎనిమిది పదుల వయసులో కూడా ఆమె కోహ్లీని చూసేందుకు ఎంతో ఆసక్తితో స్టేడియంకు వచ్చింది.

ఆమె గురించి తెలిసిన కోహ్లీ ఆమె వద్దకు వెళ్లి మరీ ఆమెతో మాట్లాడాడు.

ఆ సందర్బంగా తీసిన ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాను ముంచెత్తాయి.ఇప్పుడు ఆ బామ్మ మరణ వార్త బీసీసీఐ ప్రకటించింది.

ఇటీవల ఆమె మరణించిందని, ఆమె మరణం చాలా బాధించిందని, ఆమె మరణించినా కూడా ఆమె ఇండియన్‌ క్రికెట్‌ టీంతో ఉంటారనే నమ్మకం ఉందని ఆమెకు శ్రద్దాంజలి ఘటిస్తున్నామన్నారు.

ఆమె మరణంపై కోహ్లీ కూడా స్పందించారు.ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన కోహ్లీ ఆమె మరణం నాకు చాలా బాధను కలిగించింది.

ఆమె లాంటి అభిమాని ఉండటం ఎవరికైనా అదృష్టం అన్నాడు.

ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులను వణికిస్తున్న పక్షులు..??